Additional information
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |
₹70.00
తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.
ఆశయాల ఆఖరిమెట్టు
మనిషి ఆశాజీవి!
అడుగు అడుగుకీ ఓటమివున్నా – అడుగడుగునా ఆశని వెతుక్కోడం అలవాటు చేసుకున్నాడు. ఎక్కడో దూరాన తళుక్కుమని మెరిసే లక్ష్యాన్ని చేరుకోడానికి అతను ఆరాటపడుతున్నాడు. అతని లక్ష్యసిద్ధికి అనంత అవాంతరాలు.
అతని పేరు యాదగిరి. అందరూ గిరి అని పిలుస్తుంటారు. తక్కువకులంలో పుట్టడం అతని పాపం కాదు, కానీ, అతను కులమతాల ప్రసక్తిలో కొన్నేళ్ళు నలిగిపోయేడు. తక్కువ ఎక్కువలు కులాల్లో వుండవు. గుణాల్లో వుంటాయని అతని నమ్మిక. శ్రద్ధగా చదివేడు, తన లక్ష్యాన్ని డాక్టరై చేరుకున్నాడు. కానీ… ప్రేమలు పగలు, ఈర్ష్య అసూయలు, దగా మోసాలు, పచ్చి స్వార్థం అతని మీద విలయతాండవం చేసేయి. విసిగి పోయేడు. ఓడిపోయేడు. కట్టుకున్న భార్యనే హత్యచేసేడు.
అతని ఆశయాలకు ఆఖరిమెట్టు ఇదేనా?
మాదిరెడ్డి సులోచనగారు మీ ఆలోచనలకు వదిలిన విలువైన ప్రశ్న.
పేజీలు : 150
20 in stock (can be backordered)
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |