Additional information
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |
book-author | Madireddy Sulochana |
₹90.00
తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.
గడ్డితినే మనుషులు :
”వెనుక దగా, ముందు దగా, కుడియెడమల దగాదగా”..
కుట్రలూ, కుహకాలూ, మోసాలూ, ద్వేషాలూ, నిచ్చెనలుగా వేసుకుని, మేడిపండు నిగనిగలతో, జీవితంలో పెద్ద మనుషులనిపించుకోవడం, ధ్యేయం కొందరికి. ఆ మార్గంలో, వారికి బంధుత్వాలు, అనుబంధాలు కళ్ళకు రక్తసంబంధీకులు కూడా కంటకాలుగా తోస్తారు. స్వార్ధాన్ని వస్త్రాలుగా ధరించి జీవితాన్ని రంగుల మయం చేసుకున్నామని భ్రమిస్తారు. కానీ, వారినీ, వారి రాక్షసత్వాన్నీ, స్వార్ధపిశాచాలనూ, ఎదుర్కొనే శక్తులుగా యువతరంలో కొందరైనా ఎదిరించి నిలబడతారు.
ఈ అక్షరసత్యాలలోంచి, గోముఖ వ్యాఘ్రాల్ని బయటపెట్టి, ప్రభుత్వంలో పలుకుబడి పేరున జరిగేమోసాలు, ప్రజాహిత సంస్థల పేరుతో స్త్రీ పవిత్ర శీలాన్నే విక్రయించే కూటాల రంగులు.
పల్లెలపాలిట కుచ్చితపు నడతతో చీడపురుగులుగా అవతరించిన ప్రబుద్ధుల బండారాలు.
కొల్లగొట్టి బయటపెట్టి, అటువంటి వాల్ళు ఏ గడ్డితినడానికైనా వెరవరని నిరూపించి, నిరవధికంగా పోరాడిన ఆదర్శ పోలీసు ఉద్యోగికి అగ్నిపరీక్ష.
అతనికి సహకరించిన యువతుల అనుదిన సహాయ దీక్ష, ఈ నవల మీకందిస్తుంది. రచయిత్రి కలం మిమ్మల్ని వెంబడిస్తుంది.
పేజీలు : 192
19 in stock (can be backordered)
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |
book-author | Madireddy Sulochana |