Availability: In Stock
Katha Sravanthi
₹65.00
ఈతరం కోసం అరసం కథానికా ఉద్యమం సామాజిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ పాఠకుడి హృదయానికి సన్నిహితమైన సాహితీ ప్రక్రియ తెలుగు కథానిక. వాస్తవికత పునాదిగా, గాఢత, క్లుప్తత, సౌందర్యాలే ప్రధాన లక్షణాలుగా జీవద్భాషలో పాఠకునితో సంభాషి స్తున్న ఉదాత్త సాహిత్య ప్రక్రియ మన కథానిక.
యవ్వనతేజంతో పురుడు పోసుకున్న తెలుగు కథానిక ఎందరో విశిష్ట కథకుల చేతుల్లో సహజ సుందర
మైన రూపురేఖలు దిద్దుకుంది. నూటపది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మన కథానికది. నాలుగు తరాల కథా రచయితలు తమ కలాలతో కలల్ని పంచారు, కన్నీళ్లను తుడిచారు. ఆశలను పెంచారు, ఆశయాలను అందిం చారు. జాతికి గొప్ప భవిష్యత్తును వాగ్దానం చేశారు. ఆ
దీపధారులను ప్రతి తరానికి పరిచయం చేయాలి. ఆ కథా కాంతులను ప్రసరింప జేయాలనే నిర్మాణాత్మక బాధ్యతను అరసం – గుంటూరు జిల్లా శాఖ చేపట్టింది.
1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో గుంటూరు జిల్లా తెనాలిలో ఆవిర్భవించిన అభ్యుదయ రచయితల సంఘం సకల సాహిత్య ప్రక్రియలను ప్రభావితం చేసి సాహిత్యాన్ని ప్రజాపక్షం చేసింది. మహోన్నతమైన ఆ సాంస్కృతిక వార సత్వాన్ని స్వీకరించిన అరసం గుంటూరు జిల్లా శాఖ సాహిత్యం ద్వారా సామాజికాభ్యుదయాన్ని కాంక్షిస్తూ నిరంతర కృషిని కొనసాగిస్తూనే వుంది. కథా ప్రస్థానంలో గుంటూరు సీమది, అరసం గుంటూరు జిల్లా శాఖది ప్రత్యేకపాత్ర.
చిరస్మరణీయ కథలతో ‘కథాస్రవంతి’ శీర్షికన 80వ దశకంలో నాలుగు కథా సంకలనాలను వెలు వరించి కథా సంకలనాల ప్రచురణకు కొత్త ఊపునిచ్చింది…………..
19 in stock (can be backordered)