-
General (32)
-
Poetry (3)
-
Religious (2)
-
Short Stories (146)
-
-
Adhunika Viswa Manavudu Periyar
0ఆధునిక విశ్వమానవుడు పెరియార్
బాల్యం, వివాహం
వెంకట నాయకర్ తాయమ్మాళ్ వారికి కల్గిరి నల్వురు
సంతానముళ్ ! కృష్ణ, రామసామి, పొన్ను, కన్నమ్మాళ్ !ఆ రామసామి యే కాబోవు ద్రావిడ కజగం !!
17-9-1879లో జనియించిన రామసామి
బాల్య అవరోధాలు దాటి బాలుడాయెను !!ఆటపాటలందు అందర్నోడించెను !
అసమానతలను ఎదురించెను!!
అలగా జనంతోనే సంచరించెను !
అందరి ఆహారాలను ఆరగించెను!!కాళ్ళకు గోలుసులు గుదిబండలేసినా…
అలగాజన పిల్లలతో ఆటలాగ లేదు !
కులాల కుళ్ళును దునుమాడుటాగ లేదు !
మనుషుల పట్ల దయాగుణమాగ లేదు !!పుక్కిటి పురాణాలను ఎగతాళి చేశాడు !
అయితే దేవుడి పై భక్తి శ్రద్ధలతో ఉన్నాడు !
వ్యాపార విషయాలలో ఆరితేరాడు !
తండ్రికి కుడి భుజంగా మారాడు !!………. -
Hamsa Vimshati Vignana Sarvasvamu
0హంసవింశతి: కావ్యము- కవి
కథా కావ్యము
సంస్కృత, ప్రాకృత వాఙ్మయ చరిత్రను పరిశీలిస్తే దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే కథా కావ్యాలు వెలిసియున్నట్లు తెలుస్తున్నది. గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృతంలో రచించిన బృహత్కథ రెండు వేల సంవత్సరాల నాటిదని పండితుల అభిప్రాయం. బృహత్కథ ఆధారంగా సోమదేవుడు కథా సరిత్సాగరాన్ని, క్షేమేంద్రుడు బృహత్కథా మంజరిని రచించి యున్నారు. ఇవి గాక పంచతంత్ర హితోపదేశాలు, బుద్ధుని జాతక కథలు, కాదంబరి, దశకుమార చరిత్ర మొదలైన కథా కావ్యాలెన్నో, ఏనాడో సంస్కృత ప్రాకృతాలందు వెలసి యున్నవి. ‘కొన్ని పద్యకథా కావ్యాలు కాగా, మరికొన్ని వచన రచనలు.
కానీ ప్రాచీన కాలమున తెలుగులో వచన కథా కావ్యాలు కనిపించుట లేదు. దండి దశకుమార చరిత్రను సంస్కృత వచనంలో వ్రాసి యుండగ, దానినాంధ్రీకరించిన కేతన తెలుగులో పద్య కథా కావ్యంగా తీర్చి దిద్దారు. తిక్కన ఉత్తర రామాయణాన్ని నిర్వచనంగా వ్రాశాడు. కథాకావ్యాలే గాక వ్యాకరణాలు, నిఘంటువులు, శాస్త్ర గ్రంథాలు మొదలైనవన్నీ ఆ కాలంలో పద్య రూపంలోనే రచించుట గమనించ దగ్గ విషయం. ఇది కారణంగా మన ప్రాచీన కథాకావ్యాలన్ని పద్య రూపంలోనే వెలువడి ఉన్నాయి.
తెలుగు సాహిత్యం దాదాపు వెయ్యేండ్లుగా సాగుతూ వస్తున్నది. ఇందులో ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు మొదలైన సాహిత్య ప్రక్రియలెన్నో వెలసి ఉన్నాయి. వాటిలో కథా కావ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ కథా కావ్యాల్లో కొన్ని అనువాదాలు, అనుకరణలు కాగా మరికొన్ని స్వతంత్ర రచనలై ఉన్నాయి.
కేతన కృతమగు దశకుమార చరిత్ర, వేంకటనాథుడు రచించిన పంచతంత్రం (దీనినే నారాయణకవి, భావయ కవి వేర్వేరుగా రచించి యున్నారు). కొఱవి గోపరాజు నిర్మించిన సింహాసన ద్వాత్రింశిక, మంచన వ్రాసిన కేయూర బాహు చరిత్ర, వెన్నెలకంటి అన్నయామాత్యుని షోడశకుమార చరిత్ర, జక్కన కృతమగు విక్రమార్కు చరిత్ర, అనంతామాత్యుని భోజరాజీయము, కూచిరాజు ఎఱ్ఱన విరచించిన సకల కథా నిధానము, పుత్తేటి రామభద్రుని కథాసార సంగ్రహము, చింతలపూడి ఎల్లనార్యుని (రాధా మాధవకవి) విష్ణుమాయా నాటకము, పాలవేకరి కదిరీపతి రచించిన శుకసప్తతి, అయ్యలరాజు నారాయణా మాత్యుని హంస వింశతి మొదలైనవి తెలుగు పద్య కథా కావ్యాల్లో పేర్కొనదగినవి. అందులోను శుకసప్తతి, హంస వింశతి జారశృంగార కథలు వస్తువుగా ఒకే కోవకు చెందిన శృంగార ప్రబంధాలుగా వన్నెకెక్కినవి. శుక సప్తతి, నాటి సమాజానికి నిలువుటద్దము నెత్తగా, హంసవింశతి. నాటి సమాజంలోని శాస్త్రాద్యనేక విషయాలు ప్రస్తావించి విజ్ఞాన సర్వస్వ లక్షణాలు గల కథా ప్రబంధంగా పరిగణింపబడుచున్నది………………
-
-
Dargamitta Kathalu & Poleramma Banda Kathalu
0చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, గొప్ప గొప్పవాళ్ళని, ముక్కూ ముఖం ఎరగని చాలా మందిని ఆత్మీయులుగా నాకు చేరువ చేసిన కథల పుస్తకాలివి. ఏ పూట ఏ మూలకు వెళ్ళినా ఆదరించి అన్నం పెట్టే కల్లాకపటం ఎరగని ఎన్నో కుటుంబాల నిచ్చిన పుస్తకాలు. ఒక రకంగా నా ఆస్తిపాస్తులు. వీటిని చదివి, చదువుతూ, ఇది రాస్తున్న ఈ క్షణాన కూడా ఏదో ఒక మూల ఎవరో ఒకరు చదువుతూ నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. వారి ముఖాన నవ్వు… కంట కన్నీరు… గుండెల్నిండా ఈ కథల పట్ల ప్రేమ… ఇంకా ఏం కావాలి నాకు?
‘దర్గామిట్ట కథలు’ చదివిన పాఠకులు కొందరికి ‘పోలేరమ్మ బండ కథలు’ తెలియవు. ‘పోలేరమ్మ బండ కథలు’ చదివిన కొందరికి ‘దర్గామిట్ట కథలు’ ఉన్నట్టుగానే తెలియవు. ఆశ్చర్యం ఏమిటంటే మొదట ఎవరు ఏది చదివితే అదే ఇంకొకదాని కంటే బాగుందని వాదనకు దిగడం. ఈ తకరారు ఎందుకు? రెండు కలిపి చదువుకుంటే బాగుంటుంది అని ఇలా. నాకెంతో ఇష్టమైన కథలు ఇంకా ఇష్టంగా మీ చేతుల్లో పెడుతున్నాను.
– మహమ్మద్ ఖదీర్ బాబు
-
Upadeshasaram
0ఆత్మవిచారణ దిశగా నిచ్చెన మెట్లవలె నిర్మించబడ్డ 30 సూత్రాల సంక్షిప్త రూపంలోనున్న కర్మ, భక్తి, యోగ, మార్గాల సమగ్రసారమే ఈ గ్రంథం.
– ఆత్మవిచారం ఏ విధంగా చేయాలి?
– కేవల కుంభకం అనే సాధనను ఏ విధంగా చేయాలి?
– సమాధిలో కలిగే అనుభూతి ఏ విధంగా ఉంటుంది…?
– నేను అనే భావన నశించిన తర్వాత కలిగే సమాధి ఏమిటి…?
– యోగ సమాధికి, సహజ సమాధికిగల భేదం ఏమిటి…?
– నేను అనే భావన నశించినవాడు ఏ విధంగా మారగలడు?
మొదలైన చాలా అంశాలను ఈ భాష్యంలో సమగ్రంగా వివరించటం జరిగింది. ఈ అంశాలు ఈ భాష్యంలో తప్ప రమణ మహర్షి కాలం నుండి ఇప్పటివరకు వచ్చిన ఏ భాష్యంలోనూ చెప్పబడలేదు.