• Rayalaseema Hasya Kathalu

    0

    అతిథి దేవోభవ…

    ఆదోని బాష – 9440239828

    “డాడీ అతిథి దేవో భవ అంటే ఏమిటి?” సాయంత్రం ఇంటికి రాగానే రాంబాబుకి అతని ఆరేళ్ళకొడుకు చంటి వేసిన ప్రశ్న ఇది. అతిథి పేరు వింటేనే మండిపడే రాంబాబుకి కొడుకు ప్రశ్న విని చిర్రెత్తుకొచ్చింది.

    “వెధవా…. ఆ మాత్రం తెలీదా? అతిథి దేవో భవ అంటే అతిథి దెయ్యంలా భయపెడతాడని అర్థం” కసిగా చెప్పి విసురుగా సోఫాలో కూర్చున్నాడు. ఆ

    అతని వేగానికి సోఫా కుయ్యో మొర్రో అంటూ టకటకమని చప్పుడు చేసింది. వంటింట్లో ఉన్న లత భర్త మాటలు విని హాల్లోకొచ్చింది.

    “అదేంటండీ, ఎవరి మీది కోపమో వాడి మీద చూపిస్తున్నారు. ఆఫీసులో బాసుతో గొడవపడి వచ్చారా?” అనడిగింది.

    “గొడవపడింది బాసుతో కాదు, బాసుగారి బాసుతో” “బాసుగారి బాసా, అదెవరు?” “ఇంకెవరు, మన బాసుగారి భార్యామణి” “ఆవిడ మీ ఆఫీసుకెందుకొచ్చింది? “బుద్ధి గడ్డి తిని మేమే పిలిచాం” “ఎందుకు?”

    మా కంపెనీ చాక్లెట్ల సేల్స్ పెంచటానికి మేం అప్పుడప్పుడు కస్టమర్లతో చిన్న చిన్న మీటింగులు ఏర్పాటు చేస్తుంటామని మీకు తెలుసు కదా. ఈ రోజు అలాంటిదే ఓ మీటింగ్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా బాసుగారి భార్యని ఆహ్వానించాం. ఈ రకంగా సుని ప్రసన్నం చేసుకోవాలనుకున్నాం,

    ఆయన భార్య బిస్కెట్ కంపెనీకి సేల్స్ అడ్వయిజర్‌గా వ్యవహరిస్తోంది. ఏవో నాలుగు ఉచిత సలహాలిచ్చి మా బ్రాంచిని ప్రోత్సహిస్తుందనుకుంటే ఆవిడ మా స్టాప్ ని లక్స్ సబ్బుతో కడిగేసింది. నన్నయితే ఓబిస్కెట్ లా కరకర నమిలి తినేసింది”

    “ఇంతకీ ఆవిడ ఏం చెప్పింది?” “చాలా చెప్పింది.

    హిమాలయాల్లో ఐస్ క్రీముని అమ్మాలంది. థార్ ఎడారిలో ఇసుక వ్యాపారం చెయ్యాలని చెప్పింది. బంగాళాఖాతంలో ఉప్పుని అమ్మాలని సెలవిచ్చింది. ఇవన్నీ చెయ్యగలిగినవాడే నిజమైన స్స్మే న్ అని శ్రీకృష్ణుడిలా గీతోపదేశం చేసింది”………

    280.00
    Add to cart
  • Raa Raa Samagra Sahityam 1, 2 & 3

    0

    ముందుమాట

    ఆధునిక భారతదేశ చరిత్రలోని భావోద్వేగ పూరితమైన రెండు ఘట్టాలు రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య కారునిగా, రా.రా. గా మారడానికి దోహదం చేశాయి. అందులో మొదటిది రాచమల్లు రామచంద్రారెడ్డి మద్రాసులో గిండి ఇంజనీరింగ్ కాలేజి మొదటి సం. విద్యార్థిగా (1940-41) వున్నపుడు జరిగింది. రెండవది మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రపు తొలి శాసనసభ ఎన్నికల సందర్భంగా 1955లో జరిగింది.

    1940లో బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు ఉదృతంగా జరుగుతున్నాయి. అదే సమయంలో జర్మనీ యూరపు పై దాడి చేసి రెండవ ప్రపంచయుద్ధానికి తెరతీసి, బ్రిటీషు రాజకీయ సైనిక శక్తులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇదే అదునుగా భారత జాతీయ వాదులూ, గాంధీ, భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తామని వాగ్దానం చేయాలని బ్రిటీష్ పాలకులపై వత్తిడి పెంచారు. భారతదేశాన్ని యుద్ధంలోకి దించడానికి వ్యతిరేకంగా గాంధీజీ అక్టోబరు 1940లో దేశ వ్యాప్తంగా వ్యష్టి సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజానీకాన్ని సంఘటిత పరచడానికి పలువురు కాంగ్రెసు వాదుల్ని సన్నద్ధుల్ని చేశారు. దిక్కుతోచని బ్రిటీష్ ప్రభుత్వం ముందుకు ముందే దేశవ్యాప్తంగా ఇరవై వేల మందికిపైగా నాయకుల్ని జైళ్లలో కుక్కింది. ఈ బ్రిటీష్ దమనకాండకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం వీధుల్లోకి వచ్చి సమ్మెపిలుపు నిచ్చింది. ఆ సమ్మెలో భాగంగా మద్రాసులోని అన్ని కాలేజీల విద్యార్థులు సమ్మెబాట పట్టారు. వారిలో గిండీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులూ, వైద్య కళాశాల విద్యార్థులు కూడా వున్నారు. వారిలో అప్పటికే మార్క్సిస్టు భావజాలంతో పరిచయం వున్న రాచమల్లు

    రామచంద్రారెడ్డి గూడా వున్నాడని చెప్పనక్కరలేదు గదా!

    సమ్మె జరగడం వరకూ బాగానే వుంది. అయితే సమ్మె విరమించిన తర్వాత ఒక విచిత్రం జరిగింది. అదీ గిండీ ఇంజనీరింగ్ కాలేజీలోనే. సమ్మె ముగిసి విద్యార్థులందరూ వారి వారి తరగతులకు హాజరవుతున్నపుడు జరిగిన విచిత్రం అది. వైద్యకళాశాలతో సహా మిగతా అన్ని విద్యాలయాల అధికారులూ యెలాంటి…………

    700.00
    Add to cart
  • Nela Jaarina Mugdatvam

    0

    నేల జారిన ముగ్ధత్వం

    “శనివారం ఉదయం పది గంటలకి మా స్కూలు ఆడిటోరియంలో ఓ చినసభ ని ఏర్పాటు చేసాము. దానికి మీరుభయులూ రావలసిందిగా కోరుతున్నాం” అని స్కూలు ప్రిన్సిపాల్ ఫోన్ చేసారు. ఓ విధంగా అర్థించారు. రిక్వెస్ట్ చేసారు.

    ఆ మాటలు విన్నాక విద్యా సాగర్ ఏం మాట్లాడ లేదు. జవాబివ్వడానికేం లేదు. స్కూలుకి ఎందుకు రమ్మంటున్నారో తెలుసు.

    వెళ్తే ఏం మాట్లాడాలి,? అసలు మాట్లాడేందుకేం ఉంది ? ఏమీ లేదనిపించింది. అందుకే నిశ్శబ్దంగా భార్య విజయని చూసాడు. మౌనం ఓ సుదీర్ఘమైన భాష . భాషతో పనిలేని కమ్యూనికేషన్. వారి మధ్య అగాధాల నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఎన్నింటినో మింగేసింది.

    అందుకే ఆమె ఫోన్ ఎవరిది, ఎక్కడ నుంచీ అని ఏం అడగలేదు. అయినా విద్యా సాగర్ ఆమెకి చెప్పాడు.. ఇప్పుడు స్కూలు ప్రిన్సిపాల్ మాటలకి , ఇప్పుడిప్పుడే ఆరుతున్న కళ్ళు మరోసారి ఊట బావులయ్యాయి. వారి గుండెల్లో పేరుకు పోయిన దుఃఖం కళ్ళల్లోకి వచ్చేసింది. ఎన్నో జ్ఞాపకాలు అప్పుడే పైపొర తొలిగిన పచ్చి పుండ్లలా సలిపేస్తున్నాయి. అవి అన్ని రాత్రింబవళ్ళు అక్కర్లేని అతిథుల్లాగా

    ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు వెళ్తున్నాయో వాళ్ళకి తెలీడం లేదు. ఆ జ్ఞాపకాల లోంచి ‘అమ్మా నాకు బతకాలని ఉంది, ఇప్పుడే చావాలని లేదు’ అంటూ బాధ పడుతూ, ఏడుస్తున్న శ్వేత కనిపిస్తోంది. ఆమె గొంతు వినిపిస్తోంది………..

    150.00
    Add to cart
  • Navvipodhurugaka

    0

    జీవితంలో తగిలిన ఒక్కొక్క దెబ్బ ఒక్కో జ్ఞాపకాన్ని తట్టి లేపుతుంది. తగిలిన దెబ్బలకు శరీరమే కాదు, మనసు కూడా రాటుదేలుతుంది. రాయి కన్నా కఠినంగా మారుతుంది. పగ, ప్రతీకారాలే నా ఉచ్చ్వాస నిశ్వాసాలు. పగ, ప్రతీకారేచ్చలు లేకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేదీ కాదు, మనకు భగవద్గీత దక్కేదీ కాదు. నేను ఈ కథ రాసేవాడినే కాదు. వయస్సు పెరుగుతున్న కొద్దీ అనుభవాల స్వరూపం మారుతుంది. ఒకనాటి ఒప్పు నేడు తప్పుగా అనిపిస్తుంది. ఈ రాతలు మొదలు పెట్టినప్పుడు ఉన్న ఆవేశకావేశాలు కాలం గడిచిన కొద్దీ మారిపోయాయి. గెలుప్లుకన్నా ఓటమిని అంగీకరించడంలోనే ఆనందం ఉంది.

    సుమారు పదేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ రాతల్లో ఉన్న నిజాయితీ అప్పటికీ ఇప్పటికీ మారలేదు. కాకపోతే నిజాయితీకి ధైర్యం తోడయ్యింది. ఇవన్నీ నా జ్ఞాపకాలు. ఆత్మకథలో వాస్తవాలను వక్రీకరించే హక్కు లేదు. అభిప్రాయాలను చెప్పేటప్పుడు అలంకారాలను, అతిశయోక్తులను ఎక్కువ తక్కువలుగా చెప్పడానికి అవకాశాలున్నాయి. ఎవరైనా భుజాలు తడుముకుంటే అది వాళ్ళ ఖర్మ. ఇవి కేవలం నా అనుభవాలు మాత్రమే. ఇది నా జీవితానికి సమాధానం.

    – కాట్రగడ్డ మురారి

    750.00
    Add to cart
  • Manasuku MaroVepu

    0

    నా కథల్తో పాటు…

    ‘గతంలో, అంటే అరవై ఏళ్ళ క్రితం జన జీవితంలో ఇంతటి విపరీత వేగం లేదు. స్థిరత్వం, స్తిమితం ఉండేవి. సమాజంలో ఒకళ్ళనొకళ్ళు పట్టించు కోటం ఎక్కువగా ఉండేది. విలువల్లో మార్పు రావటానికి చాలాకాలం పట్టేది. మెజారిటీ జన అభిప్రాయం అంటూ ఒకటి బలంగా ఉండేది. ఎవరైనా అనుభవంతో ఏదైనా చెపితే చాలామందికి నచ్చేది. ఎక్కువ మంచితనం, దానికన్నా తక్కువగానే చెడుతనం ఉండేవి. అన్ని వయసుల వాళ్ళలో సంతోషం కనిపించేది.. ముఖ్యంగా వృద్ధుల్లో,

    పిల్లల్లో, ఎవరేనా ఇంటికి వస్తే, ఆ కలిసి మెలిసి గడిపే జీవితం పండుగలా ఉండేది. ఇరుగు పొరుగు, బంధువులకన్నా దగ్గరగా ఉండేవారు. అధికారం, పద్ధతులు, నియమనిబంధనల కన్నా, ఆప్యాయతది పైచెయ్యిగా ఉండేది. వెరసి జీవితంలో జీవం ఉండేది.

    ఈనాడు అవన్నీ పలచబడిపోయాయి. ప్రస్తుతం మనం జీవిస్తున్నది. వేరే ప్రపంచం. ఎవరికీ దేనికీ ఖాళీ లేదు. ఓపిక లేదు. స్తిమితంగా తినరు. | సుఖంగా సంసారం కూడా చెయ్యరు. వాళ్ళది కాని వేరే బతుకే చాలామంది బతుకుతున్నారు. యవ్వనంలో ఉన్న ఆడ, మగ మధ్య అవసరమే తప్ప, ఆకర్షణ కరువవుతున్న దౌర్భాగ్యదశ.

    ఆ రోజుల్లో దుఖాన్ని వెతికి పట్టుకుని కథలు రాశాం. ఒకరి దుఖం పది మందికి తెలిస్తే, జీవితం మెరుగుపడుతుందన్న నమ్మకంతో రాశాం. ఇప్పుడు దుఖాన్ని కాదు, సుఖాన్ని, సంతోషాన్ని వెతికి పట్టుకోవాల్సి వస్తోంది. ఆమె………….

    275.00
    Add to cart
  • Kottha Katha 2018

    0

    చెప్పుకోవడానికి ఒక కథంటూ లేకుండా ఎలా బతుకుతున్నావ్? అంటాడు దోస్తోవ్ స్కీ, నిజమే కదా! చెప్పుకోవడానికి ఏమీ లేనివాడు అందరికంటే దురదృష్టవంతుడు. భాష తెలియని ఆది మానవుడు సైతం తన కథలను గుహలలో బొమ్మల్లా చిత్రీకరించాడు. నోటి మాటగానో, తాళపత్ర గ్రంథాల ద్వారానో, దేవాలయాల గోడలపైన చెక్కిన శిల్పాల ద్వారానో మనకి వారసత్వంగా వచ్చిన ప్రక్రియ కథ.

    నవ్వు తెప్పించే హాస్యకథల రూపంలోనో, ఆలోచింపజేసే నీతికథల రూపం లోనో, మనసును రంజింపజేసే శృంగారభరితమైన కథల రూపంలోనో కథ అనే ఈ పురాతన కళాప్రక్రియ నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే గత వందేళ్ళకి పైగా వచ్చిన ఆధునిక కథ సంగతి వేరు. మన జీవితాలను గతంతో అనుసంధానం చేస్తూనే, మారుతున్న సమాజానికి అనుగుణంగా మన ఆలోచనలను వ్యక్తం చేయడానికి కథ కొత్త మార్గాలను వెతుక్కుంటూనే ఉంది. అలా వెతుక్కుంటూ చేరిన విభిన్న, వినూత్న కథల సంకలనం ఈ కొత్తకథ 2018.

    149.00
    Add to cart
  • Kotha Katha 2022

    0

    సంపాదకుల మాట స్త్రీలు చెప్పమన్న కథలు

    కథ రాయాలని కూచున్నప్పుడు రచయిత ఎదురుగా ఒక స్త్రీ వచ్చి ‘నా కథ రాయి’ అనే సందర్భాలు గతించిపోయేలా లేవు. 1980ల తర్వాత స్త్రీవాద దృక్పథంతో కథ, నవల తెలుగులో వికసించినా నాటి నుంచి నేటి వరకూ వందల కథలు వెలువడా రచయిత ఎదురుగా స్త్రీలు కూచుని ‘మా కథ రాయవేమి?’ అని డిమాండ్ చేస్తూనే ఉన్నారంటే అనంత ముఖాల స్త్రీ సమస్యల ప్రాసంగికత ఎప్పటికీ గతించిపోదనే | అనిపిస్తున్నది.

    కొత్త కథ – 2022లో తొమ్మిది కథలు స్త్రీల మానసిక, భౌతిక, సామాజిక సమస్యలను చర్చించే ప్రయత్నం చేయడం ఒక ముఖ్యమైన పరిశీలనాంశంగా తీసుకోవాలి. ఎదగవలసినట్టుగా ఎదగలేకపోయిన అమ్మాయి’ కథ నుంచి ‘అవసరం లేనంతగా ఎదిగిన గృహిణి’ కథ వరకూ రచయితలు ఈ సంకలనంలో కథనం చేశారు. ఇంత వైవిధ్యమైన చూపు కలిగి ఉండటంలో ‘రైటర్స్ మీట్ భాగస్వామ్యం ఏ కొంచెమైనా ఉంటుందనే భావన మాకు సంతోషం కలిగిస్తున్నది……

    190.00
    Add to cart
  • Katha Naadi Mugimpu Amedi

    0

    నా రచనకు వస్తువు

    ప్రతి మనిషి జీవితమూ అచ్చుకాని ఒక బృహధ్రంథం. ఆ గ్రంథంలోంచి కొన్ని నవలల్నీ, కొన్ని వందల కథల్నీ ఏరుకోవచ్చు. చాలామంది తమ జీవితపుటల్ని తెరిచే వుంచుతారు. కొన్నిచోట్ల ఒడుపుగా మనమే వాటిని తెరిచి చదువుకోవాలి. నాకు ఇతరుల జీవితాల్ని చదవడమంటే సరదా. నా రచనలకు వస్తువు చాలాసార్లు అక్కడే దొరుకుతుంది.

    అయితే, అక్కడ దొరికేది ముడిసరుకు మాత్రమే. ముడిసరుకులో మలినాలు | అనేకం వుంటాయి. ఒక్కొక్కప్పుడు అక్కర్లేనివే చాలావుండి, కావలసినది తక్కువగా వుంటుంది. దాన్ని శుద్ధి చేసుకోవాల్సివస్తుంది. నేను ఎప్పుడూ అంచెలంచెలుగా అక్కర్లేని వాటిని తొలగించుకుంటూ, అందులోంచి కావలసిన పదార్థాన్ని వేరుచేస్తాను. ఆ తర్వాత దాన్ని నాకు కావలసినరీతిలో పోతపోస్తాను. పోతసరుకు ఎప్పుడూ మోటుగానే వుంటుంది. దాన్ని చిత్రీపట్టి నగిషీలుగా చెక్కి, నాకు తృప్తిగావుంటేనే తీసుకొచ్చి నలుగురిముందూ పెడతాను. నేనే కాదు సర్వసాధారణంగా ఏ రచయితైనా అనుసరించే పద్ధతి స్థూలంగా యిదే…. అయితే సూక్ష్మంగా పరిశీలించినప్పుడు మాత్రం ఒక రచయిత అనుసరించే పద్ధతికీ, మరో రచయిత అనుసరించే పద్ధతికీ అడుగడుగునా ఎంతో తేడా వుంటూనే వుంటుంది.

    ఎక్కడో ఒక సంఘటన జరుగుతుంది. అది నా జీవితంలో జరిగిందైనా కావచ్చు. మరొకరి జీవితంలో జరిగిందైనా కావచ్చు. అందులో ఆసక్తికరమైన విషయం వుంటే | దాన్ని తీసి ఓ పక్కన పెడతాను. కొంతకాలంపాటు అక్కడే వుంటుంది. తీరికవున్నప్పుడల్లా దాని గురించే ఆలోచిస్తాను. చేర్పులూ మార్పులు చేస్తాను. చక్కటి ప్రారంభమూ, మంచి | ముగింపూ ఆలోచిస్తాను. మనసు ఒక ప్రయోగశాలగా పనిచేస్తుంది. ఎన్నో వడపోతలు | జరిగి, ఎన్నో మార్పులు చేర్పులూ పొంది, ఎంతో కాలానికి చివరికి అది ఒక ఆకారాన్ని చకుంటుంది. మనస్సనే లేబరేటరీలో వుంచిన సంఘటన, చివరకు ఒక కళారూపాన్ని సంతరించుకుంటుంది.

    ఆలోచనఅనేది మనిషి సంపాదించుకున్న గొప్ప వరం. కల్పన అతనికి చిన్నప్పటినించీ అలవాటైన విద్య. ఒక సంఘటన జరిగి, అది నలుగురి నోటిమీదుగా

    కి ఒక కొత్తకథ తయారవుతుంది. దీనికి కారణం – మనిషి ఎప్పుడూ తన కాలునిక శక్తిని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు గనక. స్వతహాగా ప్రతి మనిషిలో యీ…………..

    795.00
    Add to cart
  • Kadhalu Anuvadha Kadhalu

    0
    160.00
    Add to cart
  • Gonthu Vippina Guvva

    0

    బతికిన క్షణాల మోహరింపు

    శిలాలోలిత

    Singh Arijit

    Some

    – this week.

    in your leisure actie changes will take

    ఒక రోజు సాయంత్రం పుస్తకం తెరిచి “ఈ గువ్వ ఎలా గొంతు విప్పిందో అని గమనించాను. నిజాల నిప్పురవ్వల్ని మోస్తూ, తనలోని భావ సంచలనాలన్నింటినీ, స్వచ్ఛంగా ప్రకటించిన తీరు నన్నాకర్షించింది.

    ఇక, ఆ తర్వాత పుస్తకం నేనో, నేను పుస్తకమో అయిపోయాం . తన శైలితో పాఠకుల్ని తీసుకెళ్ళడం ఈ రచయిత్రికి అలవాటే. ‘అనాచ్ఛాదిత కథ’, ‘విరోదాభాస’తో సాహిత్య లోకంలోకి ఎప్పుడో అడుగులు వేసింది.

    కానీ, వాటికీ ఈ రచనకు మధ్య బేధం వుంది. ఏ ఇనిబిషన్స్ లేకుండా తనను తాను ప్రకటించుకునే ధైర్యం, పెరిగిన దృష్టి కోణంతో విశ్లేషించిన తీరు చాలా ఆలోచనాత్మకంగా వుంది.

    బాగా కావాలనుకున్న తీవ్ర కాంక్షలు పొందిన తర్వాత ఇంతేనా అన్పిస్తుంది. మనకు ఇష్టమైనవి దూరమైపోయినప్పుడు నిర్లిప్తత ఆవహిస్తుంది.

    మనిషే శాశ్వతం కానప్పుడు, ఇళ్ళు, కుటుంబాలు కూలిపోతున్నప్పుడు నిరాసక్తత పెరిగిపోతుంది. వద్దనుకున్నా వైరాగ్యం వదిలిపోదు. శరీరం, పైకి మామూలుగా కన్పిస్తున్నా, లోపల కుప్పకూలిపోతుంది.. మనసంతా నీటిమయమైపోతుంది. ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ ఝాన్సీలోని రకరకాల షేడ్స్ కి ప్రతిరూపం.

    150.00
    Add to cart
  • Gandla Mitta

    0

    పచ్లో వెళ్ళే ముందు..

    “కాదేదీ కథకు అనర్హం” అన్నట్లుగా ఇటీవలి కాలంలో విస్తృతంగానూ, వస్తువైవిధ్యంతోనూ, మట్టి పరిమళాల మాధుర్యాన్ని పంచుతూనూ కథలు రాస్తున్న రచయిత ఆర్.సి.కృష్ణస్వామిరాజుగారు.

    జ్ఞాపకాల్లోనో, వ్యాపకాల్లోనో కదలాడే పల్లెల్ని ఆత్మతో దర్శించి, అక్షరాల్లోకి నింపి పాఠకులకు అందిస్తున్న కథారచయిత. వీరి కథల్ని ప్రచురించని పత్రిక లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. సామాజిక కథలైనా, బాలలకు నీతిని బోధించే కథలైనా, ఆధ్యాత్మిక కథలైనా, మరే ఇతర కథైనా వీరిలో నిబిడీకృతంగా దాగివున్న ప్రతిభని తేటతెల్లం చేస్తాయి. రాజుగారు కథలకు స్వీకరించే వస్తువులు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా ఉండవు. అర్థంకాని విషయాలను ప్రతిపాదించవు. అనవసర సిద్ధాంతాలు, వాటి మీద జరిగిన రాద్దాంతాల జోలికి వెళ్లవు. మాండలికాన్ని మహామంత్రంలా జపిస్తూ కథనొక యజ్ఞంలా నడిపించే శ్రద్ధ వీరి కథల్లో కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజం, అందులోని మనుషులు, వాళ్ల చుట్టూ పెనవేసుకున్న అనుబంధాలు, వరసలతో పిలుచుకుంటూ పరవశించే వాళ్ల మలినం లేని మనసుల ఛాయల్ని వీరి కథలు చిత్రిక పడతాయి. పల్లీయుల స్వచ్ఛ మనస్తత్వానికి అద్దం పడతాయి. తాను చూసిన సంఘటనల్ని కథలో చొప్పించగల నేర్పు, చూసిన ప్రతి మనిషినీ కథలో పాత్రగా చేయగలిగిన కూర్పు రాజుగారి సొంతం. సాధారణ నడకతో మొదలైన కథ ముగింపుకి వచ్చేసరికి పాఠకుల చేత | కన్నీళ్ళు పెట్టిస్తాయి, ఆలోచింపజేస్తాయి.

    -0’గాండ్లమిట్ట” కథాసంపుటిలో ఇరవై కథలున్నాయి. వివిధ సాహిత్య సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథలను, ఆదివారం సంచికలలోనూ, అంతర్జాల పత్రికలలోనూ ప్రచురితమైన కథలను ‘గాండ్లమిట’ సంపుటిగా మనకందించారు. ఈ కథలు చదువుతుంటే.. ఊపిరిపోసుకున్న ఊరి జ్ఞాపకాలేవో రా రమ్మని ఆహ్వానం పలికినట్లుంటాయి. పారేసుకున్న బాల్యమేదో పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకున్నట్లుగా ఉంటుంది. ఒకప్పుడు నడిచిన పొలం………..

    160.00
    Add to cart
  • Chitra Veena

    0

    మనసు మీటిన “చిత్రవీణ”

    ఉరుదూ ముషాయిరాల్లో కొందరు గజలను “తరన్నుమ్” (రాగయుక్తం) గానూ, మరికొందరు “తహెత్” (రాగం లేకుండా) గానూ వినిపిస్తారు.

    గజల్ ప్రధానంగా గాన ప్రక్రియకు చెందినదే అయిననూ, ఎవరికి వారు రాగరహితంగానూ చదువుకుని ఆనందించవచ్చును. దేని సౌందర్యం దానిదే.

    హైదరాబాద్కు చెందిన ఉస్తాద్ (నజీర్ అలీ ఆదిల్ గారు)… తన గజళ్ళను తహెత్ (రాగంలేకుండా) గా వినిపించేవారు. అప్పట్లో వారి ముషాయిరాలకూ జనం కోకొల్లలుగా ఉపస్థితి అయ్యేవారు. అమితంగా ఆనందించేవారు కూడా..

    ఇప్పుడిది ఇక్కడ ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందీ అంటే, కవయిత్రి విజయ గోలి గారి “చిత్రవీణ” గజళ్ళలో అటు “తరున్నుమ్” లోనూ, ఇటు “తహెత్”లోనూ ఎలా వినిపించిననూ శ్రోతల హృదయాలను అకట్టుకోగలిగే గజళ్ళు పుష్కలంగా వున్నాయని చెప్పడానికే. ఈ క్రింది గజలను చదవండి

    “మనసెందుకు గమ్మత్తుగ గగనవీథి తేలుతుంది ! ఏమైనదో తెలియకుంది ఎద చప్పుడు పెరుగుతుంది ! కనుపాపల లాలిపాడ కరుణించదు నిదుర తల్లి కలలలోన రూపమేదొ అలలాగే కదులుతుంది ! నీలిమబ్బు ఛాయలలో జారుకురుల దోబూచుల అల్లరేదొ తీగలాగ అల్లుకుంటు నవ్వుతుంది !

    200.00
    Add to cart